‘ఆయుష్మన్ భవ’ ప్రచార ఉద్యమం పట్టణ ప్రాంత వార్డుల తో పాటుగా, పల్లెల లో సైతం పిఎమ్-జెఎవై ని గురించిన విస్తృతమైన కవరేజీ మరియు చైతన్యాన్ని అభివృద్ధి పరచడం, హెల్థ్ అకౌంట్ ఐడి లను నమోదు చేయడం మరియు వివిధ ఆరోగ్య సేవల ను అందించడం పట్ల శ్రద్ధ వహిస్తుంది అంటూ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా వ్రాసిన ఒక వ్యాసం లోని విషయాల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమ్మతి ని వ్యక్తం చేశారు.
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా ఎక్స్ మాధ్యం లో పెట్టిన ఒక పోస్ట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ –
‘ఆయుష్మన్ భవ’ ప్రచార ఉద్యమం పట్టణ ప్రాంత వార్డుల తో పాటుగా, పల్లెల లో సైతం పిఎమ్-జెఎవై ని గురించిన విస్తృతమైన కవరేజీ మరియు చైతన్యాన్ని అభివృద్ధి పరచడం, హెల్థ్ అకౌంట్ ఐడి లను నమోదు చేయడం మరియు వివిధ ఆరోగ్య సేవల ను అందించడం పట్ల ఏ విధంగా శ్రద్ధ ను తీసుకొంటుందో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా స్పష్టం చేశారు.’’ అని పేర్కొన్నారు.
Union Health Minister @mansukhmandviya elucidates how 'Ayushman Bhav' campaign focuses on comprehensive coverage, developing awareness about PM-JAY, creating health account IDs, and providing various health services in villages as well as urban wards. https://t.co/2Pt8fiR3wr
— PMO India (@PMOIndia) September 16, 2023